Friday 9 September 2011

నాగ్ ను వెనక్కి నెట్టే దిశగా చరణ్

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉందంటే...అందరూ నాగార్జున-అమల పేర్లే చెబుతారు. ఎందుకంటే నాగార్జున టాలీవుడ్ టాప్‌స్టార్. అమల మాజీ హీరోయిన్, ప్రస్తుతం పలు సేవా కార్య్రకమాల్లో చురుకుగా పాల్గొంటూ తన మార్కును చాటు కుంటోంది. అందుకే జనాల్లోనూ, మీడియాలోనూ వీళ్లిద్దరంటే తెగ క్రేజ్.

ఇటీవల వివాహం చేసుకున్న యువ హీరోలు అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్‌కు జనాల్లో మంచి క్రేజ్ ఉన్నా....వాళ్ల భార్యలకు మాత్రం పెద్దగా క్రేజ్ లేదు. పైగా వాళ్లు ఎప్పడూ పబ్లిక్‌లోకి రాక పోవడం కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు. మహేష్ బాబు భార్య నమ్రత మోడలింగ్ కెరీర్ నుంచి వచ్చినా హౌస్ వైఫ్‌గా సెటిలవ్వడంతో ఈ జంటకు పెద్దగా క్రేజ్ లేదనే చెప్పాలి. ఇక మిగతా వారి సంగతి సరేసరి.

అయితే త్వరలో ఒక్కటి కాబోతున్న రామ్ చరణ్-ఉపాసనలు మాత్రం పెళ్లికి ముందే క్రేజీ కపుల్స్ గా మారారు. రామ్ చరణ్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ఇక ఉపాసన కామినేని భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఇటీవల వీళ్లు ఇద్దరూ పోలో మ్యాచ్ ను చూడటానికి వస్తే మీడియా మొత్తం కట్టగట్టుకుని వారిని లైవ్ లో చూపించడానికి ఎగబడిందంటే...వీళ్లకి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

మరో వైపు ఉపాసన పెళ్లి తర్వాత ఇంటికే పరిమితం అయ్యే ఆవకాశం అస్సలు లేదు. ఇప్పటికే అపోలో మేనేజ్‌మెంట్‌లో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఉపాసన త్వరలో సేవా కార్యక్రమాల్లోకి దిగుతుందని సమాచారం. ఇక రామ్‌చరణ్ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పోలో టీమ్ కొనుగోలుతో చరణ్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగింది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో పాపులారిటీ విషయంలో ఈ యువ జంట నాగార్జున-అమలను వెనక్కి నెట్టడం ఖాయం అంటున్నారు.

No comments:

Post a Comment