Thursday 1 September 2011

దర్శకుడు మధుర్‌, యూటీవీకి నోటీసులు

మధుర్‌ బండార్కర్‌ 'హీరోయిన్‌' సినిమా కోసం ఐశ్వర్య రాయ్‌ ఎనిమిది రోజులు చిత్రీకరణలో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే గర్భవతి అయినందువల్ల ఆ చిత్రం నుంచి ఆమె తప్పుకొంది. దీనిపై మధుర్‌ బహిరంగంగానే ఐష్‌ని విమర్శించారు. 'హీరోయిన్‌' గురించి ఆయన మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా ఆమెను తప్పుబడుతున్నారు. దీనిపై ఐష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు చిత్ర నిర్మాణ సంస్థ యూటీవీకి, దర్శకుడు మధుర్‌కి ఆమె లీగల్‌ నోటీసులు పంపించింది. భవిష్యత్తులో తన పేరును, తను నటించిన దృశ్యాల్ని ప్రచారం కోసం వాడుకొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఐష్‌ ఈ చిత్రం నిమిత్తం అందుకున్న అడ్వాన్స్‌ రూ.22.5 లక్షల్ని యూటీవీకి తిరిగి చెల్లించారు.

'మేము ఆమెను చెల్లించమని ఎప్పుడూ అడగలేదు. అయినా మాకు ఆమె చెక్‌ పంపించింది' అని యూటీవీ వర్గాలు చెప్పాయి. తాజాగా 'హీరోయిన్‌'లో కరీనా కపూర్‌ నటించబోతోంది. ఆమె ఈ చిత్రం కోసం రూ.10 కోట్ల భారీ పారితోషికం తీసుకోబోతోందని బాలీవుడ్‌ సమాచారం.

No comments:

Post a Comment