Thursday 1 September 2011

రాజశేఖర్, సముద్ర కాంబినేషన్లో మరో సినిమా

హీరో రాజశేఖర్, యువ దర్శకుడు వి సముద్ర దర్శకత్వంలో ఓ భారీ సినిమా రూపొంద బోతోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్టును దర్శకుడు సముద్ర సిద్దం చేశారు. నిర్మాతలు ముత్తినేని సత్యనారాయణ, లగడపాటి శ్రీనివాసరావులు సంయుక్తంగా యల్.విఆర్, ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మాస్టర్ యం. రవీంద్ర తేజ ఈ చిత్రానికి సమర్పకులు.

ఈ విషయమై నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ...రాజశేఖర్ తో సినిమా చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో రాజశేఖర్ కథనాయకుడిగా ‘సింహరాశి, ఎవడైతే నాకేంటి వంటి రెండు సూపర్ హిట్ సినిమాల్ని అందించిన సముద్ర దర్శకత్వంలో ఈ సినిమా ప్లాన్ చేసినట్లు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ ముహూర్తం జరిపి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగులతో సినిమా మొదలు పెడతామన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ..రాజశేఖర్ తో తాను గతంలో చేసిన సినిమాలు హిట్టయ్యాయి. ఈ సారి ఆయనతో కలిసి హ్యాట్రిక్ సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. రాజశేఖర్ కు జతగా ఓ ప్రముఖ కథానాయికను ఎంపిక చేస్తున్నాము. మిగిలిన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment