Wednesday 31 August 2011

Spicy Priyanka Chopra Gallery



NTR and Tamanna in Oosaravelli



గౌతం మ్యాటర్ : గొడవపడ్డ మహేష్, నమ్రత

టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కాపురం పైకి సజావుగానే జరుగుతున్నట్లు కనిపిస్తున్నా....మహేష్-నమ్రతకు సరిగా పొసగడం లేదనే వార్తలు వాళ్ల ఇంట్లో పని చేసే వారి ద్వారా అప్పుడప్పుడు బయటకు పొక్కుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఇద్దరూ విడాకులు తీసుకునే వరకు వెళ్లారని, అయితే ఇద్దరు ఎంతగానో ఇష్టపడే వాళ్ల బాబు గౌతం కోసం కలిసి ఉంటున్నారనే పుకార్లు కూడా అప్పట్లో షికార్లు చేశారు.

తాజాగా....ఈ ఇద్దరి మధ్యలో మరోసారి విబేధాలు భగ్గు మన్నాయి. పని వాళ్లంతా బిత్తర పోయేలా ఇటీవల ఒకరిపై ఒకరు అరుచుకున్నారని తెలిసింది. వీళ్ల మధ్య గొడవకు కారణం కొడుకు గౌతం మ్యాటరే. గౌతంను ఊటిలోని రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించాలని నమ్రత పట్టుబడుతుండగా, వీల్లేదని మహేష్ వాదనకు దిగినట్లు తెలిసింది.

గౌతంను చూడకుండా మహేష్ ఒక్క రోజు కూడా ఉండలేడు. ఔట్ డోర్ షూటింగ్ వెళ్లినప్పుడు కూడా రోజుకు రెండు మూడుసార్లు గౌతం క్షేమ సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకుంటాడు. అందుకే గౌతంను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడం మహేష్ కు ఇష్టం లేదు. నమ్రతకు కూడా అంతే. అయితే గౌతం ఇంటి దగ్గర ఉండటం వల్ల మహేష్ బాబు సినిమాల ప్రభావం గౌతంపై పడుతుందనే ఆందోళనలో ఉంది నమ్రత. పైగా మహేష్ గారాబంతో మరీ మొండిగా తయారవుతున్నాడట. ఇటీవల విడుదలై దూకుడు ట్రైలర్లోని..‘భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది’ లాంటి డైలాగులు కంఠస్థం చేసిన గౌతం, పని వాళ్లపై వాటిని ప్రయోగించి దూషిండం మొదలు పెట్టాడట. దీంతో ఆందోళనకు గురైన నమ్రత గౌతంను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాలని డిసైండింది. దీనికి మహేష్ అడ్డు చెప్పడంతో గొడవ షురూ..అదీ మ్యాటర్.

యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్న నాగార్జునకో బృందావనం...!?

హీరోగా ఎంట్రీ ఇచ్చి 25సంత్సరాలు దాటినా హీరోగా ఇప్పటికీ బిజీగానే వుంటూ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు నాగార్జున. బాలకృష్ణ, వెంకటేష్ లతో కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో నాగార్జునే ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, చేయబోతున్న సినిమాలు కూడా ఎక్కువే వున్నాయి. రాజన్న, ఢమురుకం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటూ వుండగా శిరిడీసాయి ప్రారంభం కావాల్సి వుంది. అలాగే ఆది శంకరాచార్య చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు నాగార్జున.

ఇవి కాకుండా బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నాగ్ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. డి శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. వంశీ ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ‘రచ్చ’ తర్వాత రామ్ చరణ్ వంశీ డైరెక్షన్ లో సినిమా చేస్తాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాగార్జున, వంశీ కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం.

రవితేజను తన ‘పవర్’కు బలి చేస్తాడా?

హీరో రవితేజ-దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో ‘పవర్’ సినిమా రూపొంద బోతోందనే విషయం తెలిసిందే. వీళ్ల ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనగానే....ఫిల్మ్ నగర్ అంతటా ఓ విధమైన చర్చ మొదలైంది. ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ తో శక్తి లాంటి ప్లాపు సినిమా తీసిన మెహర్ రమేష్ ఎన్టీఆర్ సీనీ జీవితంలో మాయని మచ్చను ఏర్పరిచాడు... ఆ విషాద ఘటనను ప్రేక్షకులు, టాలీవుడ్ జనాలు మర్చి పోకముందే అదే సినిమా టైటిల్ ని ఇంగ్లీష్ లో తిరగేసి ‘పవర్’ అంటూ రవితేజపై ప్రయోగం మొదలు పెట్టాడంటూ చర్చించుకుంటున్నారు.

పవర్ సినిమా హిట్టా, ఫట్టా అనే సంగతి పక్కన పెట్టి....మెహర్ రమేష్ ప్లాపు పవర్ కి రవితేజ బలి కాకుండా ఉంటే చాలని అంతా కోరుకుంటున్నారు. గతంలో రమేష్ ను నమ్మి ‘శక్తి’ సినిమా కోసం శక్తిని మించి ఖర్చు పెట్టిన అశ్వినీదత్ ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయాడు. మరి ఈ సారి రమేష్ చూపించే ‘పవర్’కు ఈ సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మళ్ల విజయ ప్రసాద్ అనే నిర్మాత మళ్లీ ఇండస్ట్రీలో కనిపిస్తాడో? లేదో? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బద్రీనాధ్ స్కీమ్ లోనే దూకుడు రిలీజ్

బన్నీ చేసిన బద్రీనాధ్ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకున్నా మార్కెటింగ్ పరంగా ఎక్కువ ధియోటర్స్ అనే స్కీమ్ ని పాలో అయ్యి మొదటి వారంలో మాగ్జిమం లాగేసారు. ప్రస్తుతం దూకుడు దర్శక, నిర్మాతలు అదే ఫాలో అవుదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ధియోటర్స్ లో దూకుడుని వేసి ఒక్కసారిగా దూకుడు మానియా తీసుకువచ్చి వారం లోపలే మొత్తం పెట్టుబడి లాగాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగిన కసరత్తులు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో ఈ విషయమై చర్చించి ఎక్కడెక్కడి ధియోటర్స్ ని బుక్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది.

మొదటివారం వచ్చే కలెక్షన్స్ తో సేఫ్ జోన్ లో పడిపోతే తర్వాత వచ్చేదంతా లాభాలవుతాయిని, అప్పుడు వాటిలోంచి కొంత తీసి మళ్లీ పబ్లిసిటీ మీద ఖర్చు పెడుతూ సినిమాని ఓ రేంజిలో నిలబెట్టవచ్చుని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సినిమా ఎంత ఖర్చు పెట్టి తీసినీ అంతకు సమానంగా పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టకపోతే ఇబ్బందుల్లో పడతామనేది పెద్ద సినిమాలు నిరూపిస్తున్న సత్యం. మొదటి వారం చూసి ఆ తర్వాత డల్ అయిపోయిన సినిమాలు పూర్తిగా నష్టాల్లో పడిపోతున్నాయి. మొదటివారం నెగిటివ్ టాక్ వచ్చినా తట్టుకుని దాన్ని పబ్లిసిటీ ద్వారా కవర్ చేసి ముందుకెళితేనే బి, సి సెంటర్ల కలెక్షన్స్ నిలకడగా ఉంటున్నాయి. బద్రీనాధ్ అదే స్టాటజీతో నష్టాలు పెద్దగా లేకుండా బయిటపడింది. దూకుడు ఈ స్టాటజీతో ఎక్కువ లాభాల్లోకి వెళ్ళాలని ఆలోచిస్తోంది.

సెక్స్ బాంబ్ ముద్ర పడదు: విద్యా బాలన్

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్నసినిమాలో హాట్ పెర్పార్మెన్స్ కు తెరలేపిన బాలీవుడ్ తార విద్యా బాలన్ తనకు శృంగార తారగా ముద్ర పడదని, ఒక వేళ పడినా తనకు భయమేమి లేదని నిర్మొహమాటం చెబుతోంది. సిల్క్‌స్మితగానే నటిస్తున్నానని..పాత్రకు తగిన విధంగానే తన పెర్ఫార్మెన్ష్ ఉంటుందన్నారు. కొందరు హీరోయిన్లలా తానేమీ కావాలని హద్దలు దాటడం లేదని స్పష్టం చేస్తోంది. ఇది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కాబట్టే సన్ని వేశాలకు తగినట్లు కొన్ని చోట్ల బోల్డ్ గా నటిస్తున్నానని, సెక్స్ సింబల్‌గా ముద్రపడదని ఆమె అన్నారు.

దక్షిణాదిలో శృంగార తారగా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘ది డ ర్టీ పిక్చర్’ చిత్రంలో విద్యాబాలన్ నటిస్తున్నారు. మిలన్ లుత్రియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయలక్ష్మి (సిల్క్‌స్మిత) పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నసీరుద్దీన్‌షా, ఇమ్రాన్ హష్మీ, తుషార్ కపూర్‌లు నటించారు. స్మిత జన్మదినం సందర్భంగా డిసెంబర్ 2 తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి విద్యపై ఎలాంటి ముద్ర పడబోతోందో? సినిమా విడుదలైతే గానీ తెలీదు.

అప్పుడు బరితెగించి ఇప్పడు బాధపడుతున్న హీరోయిన్

ఆ మధ్య ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో అందరూ చూస్తుండగానే లిప్ కిస్ పెట్టుకుని అప్పట్లో పెద్ద చర్చకే తెరలేపారు బాలీవుడ్ హాట్ లేడీస్ రాణి ముఖర్జీ, విద్యా బాలన్. ఆ సమయంలోనే విద్య, రాణీ అనుబంధంపై రకరకాల కథనాలు కూడా మీడియాలో వెలువడ్డాయి. ఆ కథనాలకు సపోర్టు ఇచ్చే విధంగా విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ పోస్టర్‌ను తెగ పొగిడేసి మళ్లీ లేనిపోని అనుమానాలకు అవకాశం కల్పిస్తుంది రాణి. ఇటీవల విడుదలైన ‘డర్టీ పిక్చర్’ పోస్టర్లు చూసిన రాణి అవి చాలాసెక్సీగా ఉన్నాయి. ఆ పోస్టర్‌లో హాట్ గా కనిపిస్తున్న విద్యాబాలన్‌ని చూస్తే ఆడదాన్ని నాకే ఏదోలా అయిపోతోంది’ అని రాణీ వ్యాఖ్యానించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇద్దరి మద్య ‘సం’బంధం ముదురుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి

అయితే..తను ఏం మాట్లాడినా తప్పుగా తీసుకోవడంపై రాణి ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొన్నటివరకూ హీరోలతోనో, దర్శకులతోనో, నిర్మాతలతోనో మాకు అక్రమ సంబంధాలను అంటగట్టేవారు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌కీ హీరోయిన్‌కీ మధ్య స్వలింగ సంపర్కులు అంటూ సంబంధంకట్టేస్తున్నారు. ఇలాంటి అసత్యపు పుకార్ల వల్ల సాటి ఆడదానితో మాట్లాడాలన్నా భయం వేస్తోంది అంటూ తన మనసులోని బాధను వెల్లగక్కింది. ఇలాంటి వాటి వల్ల తన పరువు పోతోందని, నలుగురిలో తలెత్తుకోలేక పోతున్నాననే విధంగా ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే...రాణి అలా బాధ పడటంపై కొందరు సెటైర్లు విసురుతున్నారు. గతంలో పబ్లిక్ గా బరితెగించి, ఇద్దరూ ముద్దు పెట్టకున్నప్పుడు లేని బాధ...ఇప్పడెందుకు అని దెప్పి పొడుస్తున్నారు.

హిట్టుంది కనుకే హీరోయిన్స్ నా వెనక

నా సినిమాలు వరసగా హిట్టు వస్తూండబట్టే నా వెనక హీరోయిన్స్ పడుతున్నారు.నా తో నటించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.అదే ఒక్క ప్లాప్ వస్తే వీరవెవ్వరూ కనపించరు.నా నుంచి దూరంగా పరుగులు తీస్తారు అంటున్నాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ సరసన చేయాలని బాలీవుడ్ హీరోయిన్స్ అంతా పోటీపడుతూండటంతో మీడియావారు ఆయన్ని అదే ప్రశ్న అడిగితే ఇలా స్పందించారు.అలాగే నా సినిమాలు ఇటీవల బాగా ఆడుతుండటంతో నాతో కలిసి నటిస్తే పేరొస్తుందని సదరు హీరోయిన్స్ భావించి ఉండొచ్చు. అంతేగానీ వేరే ఉద్దేశ్యంతో కాదు అని తేల్చేసారు. అలాగే తాను 'దబాంగ్‌'కు సీక్వెల్‌ లో చేస్తున్నానని చెపుతూ... 'దబాంగ్‌' ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే రెండో భాగం తెరకెక్కుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారు. లక్నో నేపథ్యంగా కథ ఉంటుంది అన్నారు. అలాగే తనపదక్షిణాది సినిమాల్ని రీమేక్‌ చేసే హీరో అనే ముద్రపడిందన్న విషయం గురించి చెబుతూ...నా దగ్గరకు ఎవరైనా కథతో వచ్చినప్పుడు అది బాగుందా? లేదా? అని చూస్తాను.

అంతేగానీ దక్షిణాదిన విజయం సాధించింది కదా.. ఇక్కడ తీసేస్తే బాగుంటుందని ఆలోచించను. స్క్రిప్టులో కొన్ని మార్పులు అవసరమనిపిస్తే తప్పకుండా చేయిస్తాను. హిందీ ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే అంశాల్ని జోడించిన తరవాతే సినిమాలో నటించేందుకు అంగీకరిస్తాను. అందుకే 'వాంటెడ్‌', 'రెడీ' విజయం సాధించాయి అన్నారు. అలాగే యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌లో నటించటం గురించి చెబుతూ.. 'ఏక్‌ థా టైగర్‌' చిత్ర కథ బాగుంది కాబట్టే.. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌లో నటిస్తున్నాను. రొమాంటిక్‌ తరహా ప్రేమకథలో యాక్షన్‌కి కూడా చోటుంది అన్నారు.ఇక సల్మాన్ స్వయంగా నిర్మించిన 'చిల్లర్‌ పార్టీ' పెద్దగా ఆడలేదనే విషయం గురించి చెపుతూ...'షోలే' అంత విజయం సాధించాలని నేనేమీ 'చిల్లర్‌ పార్టీ'ని తీయలేదు. అదో చిన్న పిల్లల సినిమా. చూసిన వాళ్లందరికీ నచ్చింది. అయితే ఎక్కువ మంది చూడకపోయి ఉండొచ్చు. ఒకసారి టీవీల్లో ప్రసారమైతే అందరూ చూస్తారు. అప్పుడు నా ప్రయత్నాన్ని తప్పకుండా మెచ్చుకుంటారు అన్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డు చిత్రం విడుదల కానుంది. ఇక బాడీగార్డు చిత్రంలో సల్మాన్ తన దైన శైలిలో పంచ్ డైలాగులు చెప్పటానికి రెడీ అవుతున్నారు.

వెంకీ ‘గంగా ది బాడీగార్డ్’ అక్టోబర్ 21న?

విక్టరీ వెంకటేష్ ‘గంగా ది బాడీగార్డు’ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తూంది. సినీవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, షూటింగ్ చివరి దరశకు చేకుందని తెలిసింది. సెప్టెంబర్ మాసాంతంలోగా షూటింగ్ పూర్తి చేసుకుని...అనంతం పోస్టు ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

ఈ సినిమాలో వెంకీ సరసన త్రిష లీడ్ రోల్ చేస్తుండగా, సలోని ముఖ్య పాత్రలో కనిపించనుంది. గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిశ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్టయిన బాడీగార్డు సినిమాకు ఇది రీమేక్. తమిళంలోఇప్పటికే కావలన్ పేరుతో రీమేక్ చేశారు. హీందీ వర్షన్లో సల్మాన్ ఖాన్ హీరోగా ‘బాడీగార్డ్’ సినిమా రూపొందింది. హిందీ బాడీగార్డు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు(ఆగస్టు 31,2011) విడుదలవుతోంది.

గోవా ఫిలిం ఫెస్టివల్‌కు జైబోలో తెలంగాణ

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా గోవాలో సెప్టెంబర్ 15 నుంచి జరిగే సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికయింది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వేడుకలో దక్షిణ ఆసియాకు చెందిన ఎనిమిది దేశాల నుంచి ఎంపికైన దాదాపు 50 సినిమాలు ఇందులో ప్రదర్శింపబడనున్నాయి. ఈ సందర్భంగా ‘జైబోలో తెలంగాణ’ చిత్ర దర్శక, నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ- ‘‘ఇది తెలుగు సినిమా విజయం. ప్రెస్టేజియస్‌గా జరిగే ఈ వేడుకలో ‘జై బోలో తెలంగాణ’ ఎంపిక అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఎన్‌.శంకర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మితమై ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. తెలంగాణ సంప్రదాయాలు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థుల వీర గాథల ప్రధాన అంశంగా తెలంగాణ ప్రజల మనోగతాన్ని అద్దం పట్టే విధంగా మానవీయ కోణంతో ఈ చిత్రం తెరకెక్కింది.

బెల్లంకొండ నెక్స్ట్ ఆ యంగ్ హీరోతో ఖరారు

కందీరీగ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఆయన తదుపరి చిత్రాన్ని కూడా వినోదం రంగరించిన రూటులో వెళ్ళి తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు సీమ శాస్త్రి,సీమ టపాకాయ వంటి కామిడీ చిత్రాలను గతంలో అందించిన జి నాగేశ్వర రెడ్డిని దర్శకుడుగా ఎన్నుకున్నారు. వాస్తవానికి నాగేశ్వర రెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లరి నరేష్ తో ప్లాన్ చేసుకున్నారు. కానీ నిర్మాతతో వచ్చిన విభేధాలుతో ఆ చిత్రాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక విష్ణు కూడా వస్తాడు నా రాజు చిత్రం అనంతరం ఏ చిత్రమూ చేయలేదు. అక్టోబరులో షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం వినోద ప్రధానమైన కథతో మాస్‌, యాక్షన్‌ అంశాలకీ చోటుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇక చిత్రాన్ని విష్ణు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'ఢీ' తరహాలో మలచాలని బెల్లంకొండ భావిస్తున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ...వెంకటేష్ హీరోగా బాడీగార్డ్ రీమేక్ చేస్తున్నారు.త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రాన్ని డాన్ శీను తో పరిచయమైన గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్నారు.

డాన్సులు, యాక్షన్ సీన్స్ చేయలేని అల్లు అర్జున్...!

అల్లు అర్జున్ భుజానికి సర్జరీ చేయించుకోవడానికి పెర్త్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా ముగియడంతో అల్లు అర్జున్ పూర్తిగా కోలుకున్నాడట. వచ్చేవారం ఇండియా తిరిగి రావడానికి సమయాత్తమవుతున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం నుంచి ఆరంభం కానుందట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా, కాజల్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పెద్దగా డాన్సులు వేసే అవకాశం లేదనీ, యాక్షన్ సీన్స్ కూడా వుండబోవనీ ఇన్ సైడ్ సోర్సెస్ కథనం. ఆర్నెళ్ళపాటు రెస్ట్ తప్పనిసరి కావడంతోనే యాక్షన్, డాన్స్ లు ఎక్కువగా లేకుండా త్రివిక్రమ్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అయితే మొదట మామూలు సన్నివేశాలు పూర్తి చేసేసి, చివర్లో యాక్షన్ పార్ట్స్..పాటలు తీస్తారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో బన్నీ హెల్త్ ప్రాబ్లమ్ సీరియస్ కాదనీ, చిన్నపాటి సర్జరీ మాత్రమే జరిగిందనీ, నెల రోజుల్లో పూర్తిగా నయమవుతుందనీ, మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న టాక్..

పూరీ మ్యూజిక్ కే మహేష్ బిజెనెస్ మ్యాన్

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతోన్న ది బిజెనెస్ మ్యాన్ చిత్రం ఆడియో రైట్స్ ని పూరీ మ్యూజిక్ సొంతం చేసుకోంది. పూరీ సంగీత్ పేరుతో గతంలో మ్యూజిక్ కంపెనీని పెట్టిన పూరీ బంపర్ ఆఫర్ చిత్రం ఏది మ్యూజికల్ హిట్ ఇవ్వలేకపోయింది.దాంతో పూరీ ఈసారి దాని పేరు మార్చి పూరీ మ్యూజిక్ అని పెట్టి మళ్ళీ మార్కెట్లోకి రావటానకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తను రెమ్యునేషన్ ని పణంగా పెట్టి ది బిజెనెస్ మ్యాన్ చిత్రం ఆడియోని సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.

మహేష్ సినిమాకు ఓ రేంజి ఆడియో మార్కెట్ ఉంటుంది కాబట్టి తనకు బాగా కలిసి వస్తుందని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ది బిజినెస్ మ్యాన్ చిత్రం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం లొకేషన్స్ ఎంపికలో బిజిగా ఉంది.పూరి జగన్ తన అసెస్టెంట్స్ తో కలసి లొకేషన్స్ ని వెతుకుతున్నారు.ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు.హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.

కాజల్ లవ్ లో పడిందా..డేటింగ్ చేస్తోందా...!?


టాలీవుడ్ లో ఉన్నంత కాలం తెలుగు మీడియా మంచితనంతో తాను అనుకున్న స్థానానికి చేరుకున్న కాజల్, తమిళ మీడియా దెబ్బకు గింగరాలు తిరిగిపోతుంది. గాసిప్స్ లో కూడా మరీ అసలు చూసి వచ్చినట్టుగా వారు రాసేయటంతో కాజల్, మీడియా వారిని పిలిచి మరీ భోరుమంటుందట. ఇంతకీ వారు ఏం రాశారంటే ఓ యువ హీరోతో డేటింగ్ చేస్తుందని....ఆ కారణం చేతనే ఈ అమ్మడు ఓ సినిమాలో హీరో ఇన్ ఫ్లూయెన్స్ తో తన పాత్ర నిడివని పెంచుకుందని...మరో సినిమాలోనూ ఆ హీరోతో జతకట్టబోతోందని..ఇలా రాశారు...

దీంతో కాజల్ మాట్లాడుతూ ‘నాకు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులున్నారు. అయితే రొమాన్స్ చేసే అంత సాన్నిహిత్యం వారితో నాకు లేదు. ఇలాంటి రూమర్స్ వల్ల ఇటు వ్యక్తిగతంగానూ..అటు వృత్తిగతంగానూ ప్రభావం చూపుతాయి. ఇలాంటి వాటిని చదివినప్పుడు నేను ఒక్కదాన్నే కాదు ఇంట్లో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు బాధపడతారు. దయచేసి ఇలాంటి వార్తలు రాసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని ప్రాధేయపడిందట.

సింగం సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్స్ సాధించిన కాజల్ అజయ్ దేవగన్ తో క్లోజ్ గా ఉన్నట్టు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. మహేష్ బాబు బిజినెస్ మాన్ షూటింగ్ లో బిజీ గా ఉన్న కాజల్ ఒకానొక దశలో ప్రభాస్ ను పెళ్లి చేసుకోనుందనే వార్తలు కూడా వినిపించాయి.మరి ఉన్నట్టుండి రెబల్ కు ఎందుకు గుడ్ బై చెప్పిందంటూ సిని వర్గాలు ఆరా తీస్తున్నాయ్..

‘డర్టీ పిక్చర్’ పై కోర్టు వెళ్లే యోచనలో స్మిత బంధువులు



అలనాటి సౌంతిండియా ఐటం గర్ల్ సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘డర్టీపిక్చర్‌’ ఇప్పటికే సంచనాలు, వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో కెక్కుతూ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టిల్స్‌, టీజర్స్‌ జనాల్లో ఒక విధమైన చర్చకు దారి తీశాయి. తాజాగా ఈ సినిమాపై మరోసారి వివాదం చెలరేగింది. సిల్క్‌ స్మిత పాత్రధారి విద్యాబాలన్‌.. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్‌ హష్మీ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్లు చిత్రీకరించడమే తాజా వివాదానికి కారణం. స్మిత జీవితాన్ని మరీ డర్టీగా చూపిస్తున్నారంటూ ఆమె బంధువులు దర్శకనిర్మాతలను కోర్టుకీడ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఐటం గాళ్‌గా స్మిత జీవితంలోని ముఖ్య ఘట్టాలు, జీవన శైలి, ట్రాజెడీ, ఆత్మ హత్యతో ఆమె జీవితం ముగిసిన తీరు..ఇలా ఆమె జీవితంలోని ముఖ్య సంఘటనలను ప్రస్తావిస్తూ దర్శకుడు మిలన్‌ లుద్రియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్‌ 2న విడుదల చేయడానికి నిర్మాతలు ఏక్తాకపూర్‌, శోభాకపూర్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Tuesday 30 August 2011

ఆ..సీన్లలో నటించడానికి అభ్యంతరం లేదన్న హాట్ లేడీ

శృంగార భరిత సీన్లలో..హాట్‌గా, బోల్డ్‌గా నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తోంది బాలీవుడ్ హాట్ లేడీ విద్యా బాలన్. ఫైగా తనతో ఆ సీన్లు చేయిస్తున్న దర్శకుడు మిలన్ లూథ్రియాను తెగ పొగిడేస్తోంది. దర్శకుడు నమ్మకస్తుడు.. నన్ను తప్పుగా కాకుండా సరైన యాంగిల్ లో చూపిస్తాడనే నమ్మకం ఉంది అని చెబుతోంది. అందుకే శృంగారం పాళ్లు కాస్త ఎక్కువగా ఉండే బెడ్ రూం సీన్లు చేసేప్పుడు ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా చేయగలుగుతున్నాను అంటోంది.

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న డర్జీ పిక్చర్‌లో..స్మిత పాత్రను పోషిస్తున్న విద్యా, స్మితను మించి పోయే రేంజ్ సెక్సీ సీన్లు పండించడానికి నడుకట్టింది. ఈ సినిమాలో విద్యా... తుషార్ కపూర్ తో పాటు, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మితో కలిసి రొమాన్స్ చేయనుంది. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్‌కు విద్యాకు మధ్య మత్తెక్కించే ముద్దు సీన్లు కూడా ఉన్నాయి ఇందులో. డిసెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

దర్శన్ 'డార్లింగ్' కాజల్ కాదు..అనుష్క..!?

తెలుగులో ప్రభాస్, కాజల్ జంటగా నటించిన ‘డార్లింగ్’ చిత్రం కన్నడంలో ‘బుల్ బుల్’ పేరిట రీమేక్ కానుంది. దర్శన్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో అనుష్కను కథానాయికగా నటించమని కోరారట. కానీ అనుష్క భారీ పారితోషికం డిమాండ్ చేసిందని వినికిడి. ఒకవేళ నిర్మాత కనుక ఆ పారితోషికం ఇచ్చి అనుష్క ను తీసుకుంటే అప్పుడు కన్నడ రంగంలో అధిక పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ అనుష్కే అంటున్నారు సాండిల్ వుడ్ ఫిల్మి ఇండస్ట్రీలో.

కాగా మొదట కన్నడ డార్లింగ్ గా కాజలే తొలిసారి కన్నడంలో యాక్ట్ చేయడానికి ఒప్పుకొందని సమాచారం. తెలుగులో ప్రభాస్ సరసన ‘డార్లింగ్’ నటించిన కాజల్ కన్నడ రీమేక్ లో నటింపచేయాలని చూసిన హీరో దర్శన్ కి నిరాశే ఎదురైంది. టాలీవుడ్, బాలీవుడ్, లో బిజీగా ఉన్న కాజల్ ప్రస్తుతం కన్నడ సినిమా చేయడానికి ఇష్టపడక డేట్స్ కాలీ లేవని చెప్పడంతో సదరు నిర్మాత అనుష్కకు కమిటైనట్టు సమాచారం. అలా శాండిల్ వుడ్ లో కాజల్ క్రేజ్ కి అనుష్క చెక్ పెట్టిందని ఇండస్ట్రీలో టాక్.

స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తికాలేదని..ప్రస్తుతం దానిమీదే పనిచేస్తున్నామని దర్శకనిర్మాతలు శ్రీదర్ యండి, దినకర్ లు తెలిపారు. అలాగే ప్రస్తుతం దర్శన్ తన క్రేజీ ప్రొజెక్ట్స్ సంగోల్లి రాయన్న అన్న చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారని ఆ చిత్రం పూర్తి అవ్వగానే అనుష్క, దర్శన్ ల డార్లింగ్ సెట్స్ పైకి వెలుతుందని..దర్శకుడు తెలిపారు.

తెరపై ఒకరు..తెర వెనుక ఒకరితో రొమాన్స్ చేస్తున్న రవితేజ..!

రవితేజ ఈ మధ్య నటించే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లుతో కలిసి రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే..‘మిరపకాయ్’ చిత్రంలో దీక్షాసేథ్, రిచా గంగోపాధ్యాయలతో కలిసి రవితేజ రొమాన్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఒక హీరోయిన్ అయిన ధీక్షాసేథ్ ను ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘నిప్పు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మరి మిగతా హీరోయిన్ రిచాను వదిలేసాడనుకుంటున్నారా. అంతలేదు. దీక్షాతో వెండితెరపై రొమాన్స్, వెండితెర వెనుక రిచాతో రొమాన్స్ చేస్తున్నాడని తాజా అందిన సమాచారం.

‘మిరపకాయ్’ చిత్రం తర్వాత రిచాతో తరుచూ టచ్ లో ఉంటూ, తన కార్ లోనే వీరిద్దరు లాంగ్ డ్రైవ్ కు వెళుతున్నాడటని సమాచారం. ‘నిప్పు’ చిత్రం తర్వాత రవితేజ నటించబోయే చిత్రంలో హీరోయిన్ గా రిచాను తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడట. మరి రవితేజ ఇడియటా లేక ఈ అబ్బాయి చాలా మంచోడా? లేక నిప్పా?

వాళ్ల మధ్య ఇరుక్కున్న హీరోయిన్ స్నేహ

ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంది కానీ....ఒకప్పడు టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ లోనూ హీరోయిన్ స్నేహకు మంచి డిమాండ్ ఉండేది. అయితే ప్రస్తుతం అమ్మడి వయసు పెరిగి పోవడంతో అవకాశాలు మందగించాయి. దీంతో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, షాపుల ఓపెనింగులు చేస్తూ కెరీర్‌ను నెట్టకొస్తోంది అమ్మడు.

ఇటీవల స్నేహ చెన్నయ్ ఎన్ఎస్ఆర్ రోడ్ లోని సాయిబాబా కాలనీలో.... ఏంజల్ కలెక్షన్స్‌కు చెందిన సల్వాజ్ కమీజ్ షోరూంను ప్రారంభించేందుకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి చేరుకుని స్నేహను చుట్టు ముట్టేశారు. ఆమె తిరిది వెలుతుంటే వెళ్ల నీయకుండా కారుకు అడ్డుపడ్డ అభిమానులు ఆమోకు షేఃక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఆటో గ్రాఫ్ పెట్టించుకోవడానికి పోటీ పడ్డారు. ఆ విధంగా అభిమానుల మధ్య ఇరుక్కున్న స్నేహ అక్కడి నుంచి బయట పడటానికి నానా తంటాలు పడింది.

తమ్ముడి కోసం ప్రభాస్ ఆరాటం

ఎప్పుడూ కూల్‌గా ఉండే యంగ్ రెబల్ స్టార్ ఈ మధ్య తెగ హైరానా పడిపోతున్నాడు. టెన్షన్ ఫీలవుతున్నాడు. తన ఖజిన్ సిద్ధార్థ రాజ్ కుమార్ నటించిన ‘కెరటం’ సినిమా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే ఇందుకు కారణం. ఇండస్ట్రీలో తనకు ఉన్న ఇమేజ్ ను ఉపయోగించిన తమ్ముడికి లైఫ్ ఇద్దామనుకున్న....ప్రభాస్ ఆశలు గల్లంతయ్యాయి. దీనికితోడు సినిమాపై నెగెటివ్ రాతుల రాస్తారా? అంటూ సినిమా రివ్యూలు రాసే జర్నలిస్టులపై సిద్దార్థ నోరు పారేసుకున్నట్లు తెలుస్తూంది.

అప్పటి నుంచి మీడియాలో కెరటం గురించి గానీ, సిద్దార్థ గురించి మీడియాలో వార్తలు రావడమే బంద్ అయ్యాయి. ఈ పరిణామాలు తమ ఫ్యామిలీకి, తనకెరీర్ కు నష్టం కలిగిస్తాయని ఊహించిన వారిని కూల్ చేసే పనిలో పడ్డాడు. ఈ విధంగా తమ్ముడి కోసం తెగ ఆరాట పడుతున్నాడు, తన ఇమేజ్ తో అతని కెరీర్ కు బూస్ ఇచ్చే పనిలో బీజిగా ఉన్నాడు ప్రభాస్.

మనస్పర్దల వల్ల విడిపోయిన జంట మళ్లీ కాఫీ షాప్‌లో కలిసింది..

జెస్సికా బెయిల్ అమెరికా మోడల్, స్టార్ హీరోయిన్. సెవెంత్ హెయిన్ అనే ఫ్యామిలీ డ్రామాలో మారీ కామ్డెన్ పాత్ర ద్వారా టెలివిజన్ అభిమానులను సంపాదించుకున్నారు. వీటితోపాటు హాలీవుడ్ సినిమాలైన సమ్మర్ క్యాచ్, ద ఎ టీమ్ లాంటి బాక్సా ఫీస్ సినిమాలలో కూడా నటించారు. సింగర్‌గా ఉన్న రోజుల్లో తన కోస్టార్ హీరో అయిన జస్టిన్ టింబర్‌లేక్‌తో కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ఏవో కొన్నిమనస్పర్దలు రావడంతో ఇద్దరూ ఈ సంవత్సరం మొదట్లో విడిపోడం జరిగింది.

ఐతే ఇటీవల కెనాడాలోని టోరెంటోలో ఉన్న ఎల్లాస్ కాఫీ షాప్‌లో ఇద్దరూ కలసి కాఫీ త్రాగుతూ రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు. వీరిద్దరి అక్కడ చూసిన అభిమానులు తెలిపిన దానిప్రకారం ఇద్దరూ కూడా మొదట్లో ఎలా ఐతే కలసి మెలసి ఉండే వారో అదే విధంగా వారియొక్క ఐడియాస్‌ని షేర్ చేసుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించారని సమాచారం. చాలా రోజులు తర్వాత కలుసుకున్న వీరిద్దరిలో జస్టిన్ టింబర్‌లేక్, జెస్సికా బియిల్‌ను చూస్తూ అలానే ఉండిపోవడం జరిగిందంట.

అంతేకాకుండా జస్టిన్ జెస్సికాతో మాట్లాడుతూ జీవితాంతం నీ ముఖంలో ఇలాంటి ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నానని వెల్లడించాడని సమాచారం. ఇది చూసిన వాళ్శంతా త్వరలోనే వీరిద్దరూ మరలా కలసి పోతారని గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా ఇద్దరూ కలసిపోతే ఎంచక్కా డేటింగ్‌లు, పార్టీలు, పబ్‌లంటూ తిరగొచ్చునని వెటకారంగా తెలిపారు. కానీ హాలీవుడ్లో డేటింగ్ చేసుకొవడం, విడిపోవడం, మరలా కలసి పోవడం లాంటివి సర్వసాధారణం అని వారికి తెలిసిందే.

చిరు డ్రీమ్ ప్రొజెక్ట్ లో హీరోయిన్ శ్రీదేవి....!

చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? అనే అంశంపై ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు చెలరేగుతుండడం తెలిసిందే. ఇప్పుడు ఈ ఊహాగానాల్లో భాగంగా అతిలోక సుందరి శ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ అనే హిందీ చిత్రంతో శ్రీదేవి తన సెకండ్ ఇన్నింగ్స్ కు శ్రీకారం చుడుతుండడం తెలిసిందే. ఈ నేపధ్యంలో తనతో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నటించిన శ్రీదేవిని తన సరసన నటింపజేసుకోవాలని చిరంజీవి తలపిస్తున్నారని సమాచారం అందుతోంది...

శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకోవడం వలన చిరంజీవికి కలిగే అడ్వాంటేజ్ ఏమిటంటే..హిందిలోనూ ఈ సినిమా విపరీమైన ప్రచారం లభిస్తుంది. ఇక తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ శ్రీదేవిని ఎరుగని వారంటూ ఉండరు. కాబట్టి శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకుంటే తనకు, తన చిత్రానికి జాతీయస్థాయిలో ప్రచారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో, తన 150వ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకుని, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎవరైనా కుర్ర హీరోయిన్ ని తీసుకుందామని చిరంజీవి డిసైడ్ అయ్యారని

నాగార్జున-టబులకు అనుకూలంగా అమల..!?

గ్రీకువీరుడు, నా రాకుమారుడు..అంటూ నాగార్జునకి దగ్గరైన టబు ఈ ఇద్దరి జంట వెండి తెర కొన్ని సినిమాలు చేశారుజ నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం విధితమే. ఇదీ నాగార్జున స్వయంగా టబు బెస్ట్ ఫ్రెండ్ అని ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. అయితే ఈ ఇద్దరి గురించి టాలీవుడ్ లో గుసగుసలు చాలా వినిపించాయి. అది నిజమో కాదో తెలియదు కానీ..నాగార్జున మాత్రం తన భార్య అయిన మాజీ హీరోయిన్ అమలను బాగానే తనకు అనుకూలంగానే మార్చుకున్నాడు.

అమల కూడా ఒకప్పటి హీరోయిన్ కాబట్టి..సినిమా ఇండస్ట్రీలో ఏంజరుగుతుందో తెలుసు కనుక ఈ ఇద్దరి జంటను పెద్దగా పట్టించుకోదని తెలుస్తుంది. అయిన అమల టబుతో మంచి స్నేహసంబందాలు కూడా వుందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో టబు కోసం అమల స్వయంగా దగ్గరుండి ఒక ఇంటికి కట్టించిందని వార్తలు వస్తున్నాయి. నాగార్జున మాత్రం టబు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుంది అని పబ్లిక్ లో చెప్పాడు. టబూ విషయంలో నాగార్జున చాలా తెలివిగా వ్యవహరిస్తాడట. నేను పొడుగు, టబు పొడుగు కాబట్టి ఆ ఇద్దరి జోడీ బాగుంటుందని అందరు అంటున్నారని కూడా చెప్పాడు...

బికినీ బాడీ ఉండడం వల్లే ప్రతి మ్యాగజైన్ కవర్ పేజిపై

ఇంగ్లీషు గ్లామర్ ప్రపంచంలో మోడల్‌ నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్నారు మారియా ఫోలర్. ప్రపంచం వ్యాప్తంగా పబ్లికేషన్స్‌లో తన అందాలను ప్రదర్శించడమే కాకుండా ప్రముఖ లండన్ మ్యాగజైన్స్‌లలో కూడా అందాలను ప్రదర్శించేవారు. 2010వ సంవత్సరంలో ఐటివి2 సిరిస్ ద ఓన్లీ వే ఈజ్ ఎసేక్స్ కార్యక్రమంలో సపోర్టింగ్ రోల్ ద్వారా అభిమానులు సంపాదించుకున్నారు. మారియా ఫోలర్ ఎప్పుడూ కూడా బికినీల ద్వారా తన అందాలను ఎక్స్ పోజ్ చేయాలని కోరుకుంటారు. అందుకు తగ్గ బికినీ బాడీ కూడా ఆమె ఎంతో కష్టపడి సోంతం చేసుకున్నారు.

ఇటీవల కాలంలో మారియా ఫోలర్ మార్బెల్లాలోని బీచ్‌లో ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ ఆమె ధరించిన టూపీస్ బికినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచింది. అందుకు కారణం మారియా ఫోలర్ ధరించిన పింక్ బికినీ చిన్న పిల్లలు ధరించే దుస్తులకు మాదిరే కళ్లును సైతం ఇబ్బంది పెట్టేవిధంగా ఉందని సమాచారం. 25 సంవత్సరాలు వయసు కలిగిన మారియా ఫోలర్ తన శరీరానికి సరిపోనటువంటి బికినీని ధరించి తన స్నేహితులతో మార్బెల్లాలోని బుద్దా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఈ ప్రక్క చిత్రంలో చూడోచ్చు.

అంతకముందు రోజు మారియా ఫోలర్ వన్ పీస్ బికినీ ధరించి మార్బెల్లా ఓషన్ క్లబ్‌లో జరిగిన క్యాంపెయిన్ స్ప్రే పార్టీకి హాజరవ్వడం జరిగింది. ఆ పార్టీలో మారియా ఫోలర్ ఛాంపియన్ బాటిల్ పుల్‌గా తాగి తన బాయ్ ప్రెండ్ గ్రెగ్ చర్చ్‌తో మంతనాలు జరిపింది. మారియా ఫోలర్ శరీరం బికినీ బాడీగా పేమస్ అవ్వడంతో అందరూ కూడా మారియా ఫోలర్‌ని తమ మ్యాగజైన్స్‌లలో అందాలను చూపించాల్సిందిగా కోరడం జరుగుతుంది.

ఇన్ సెక్యూరిటీ ఫీలవుతున్న చిరంజీవి..

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కాస్తా ఇప్పుడు అధికార పార్టీలో ఒక సాధారణ ఎమ్మేల్యేగా మారిపోయాడు చిరంజీవి. స్వయంకృషితో నటుడిగా ఎదిగిన చిరంజీవి స్వయంకృతంతో నాయకుడిగా నిలబడలేకపోయాడు. మీడియా ఏనాడో లైట్ తీసుకున్న చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా ఏం మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకా అతని మాటలకి విలువ అంటూ ఉంటే అది కేవలం సినిమాలకి సంబంధించే. ఈ సంగతి గుర్తించిన చిరంజీవి వార్తల్లో తన పేరు వినిపించేందుకు తన 150వ సినిమా ప్రస్తావన తెస్తున్నాడు.

మీడియా కూడా అతని మాటల్ని పట్టించుకుని పబ్లిసిటీ ఇస్తోంది. అదే పొలిటికల్ మేటర్ ఏదైనా మాట్లాడితే చిరంజీవి కనీస ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో తనని జనం మర్చిపోతున్నారనే అభద్రతాభావంతో చిరంజీవి మళ్ళీ నటించాలని అనుకుంటున్నారు. అయితే ఎలాంటి సినిమా చేయాలనే విషయంలోనూ అతనికి క్లారిటీ లేక దానిని సాగదీస్తూ పోతున్నాడు..

చిరు తీరు...లబోదిబో మంటున్న కార్ల కంపెనీ

పాతికేళ్ల పాటు వెండితెరను ఏలిన చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకే మెగాస్టార్‌గా మారారు. ఈ క్రమంలో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. చిరంజీవి ఏ పని చేసినా, ఎలాంటి స్టేట్ మెంట్ ఇచ్చినా అది త్వరగా ప్రజల్లోకి వెలుతుంది. ఈ నేపథ్యంలో గతంలో చిరంజీవి చర్యల వల్ల ఫ్యాన్స్ సంతోష పడ్డ సందర్భాలు, అప్ సెట్ అయిన సందర్భాలు ఉన్నాయి కూడా...

తాజాగా...ఓ కార్ల కంపెనీ చిరంజీవి తీరుతో లబోదిబో మంటోంది. మగధీర సినిమా ద్వారా సెన్సేషన్ హిట్ కొట్టిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన రెమ్యూనరేషన్ వెచ్చించి తండ్రికి ప్రపంచ ప్రసిద్ధ ఖరీదైన ‘రోల్స్ రాయిస్’ కారును కొని పెట్టాడు. అయితే కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఆ కారును వాడటం లేదు. దీంతో ఆ కారు చిరు ఇంట్లో ఓ మూలకు ఫెడ్డుకే పరిమితం అయింది. రాజకీయాల్లోకి వచ్చాడు సింపుల్ గా జీవించాలని ఆ నిర్ణ యం తీసుకున్నాడనుకున్నాం...అందుకే ఆ ఖరీదైన కారు వాడటం లేదని అనుకుంటే పొరపాటే. చిరంజీవి ప్రస్తుతం రూ. 2.5 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ కారును వాడుతున్నారు.

దీంతో రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ లబోదిబోమంటోంది. మోగాస్టార్ ఇంటికి మా కారు వెళ్లిందని తొలుత సంతోష పడ్డాం....కానీ ఆయన తీరుతో ఇప్పడు బాధ పడుతున్నాం అని రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన సీనియర్ సేల్స్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు. తమ కంపెనీ కారును అప్పుడప్పుడైనా రోడ్ల మీదకు తెస్తే బాగుంటుందని అంటున్నారు.

సినిమాల్లోకి వచ్చి విలువైంది పోగొట్టుకొన్నా: శ్రియ

శ్రియకు ఇప్పుడు తన పరిస్థితి చూసే తనే మండిపడుతోంది. సినిమాల్లోకి వచ్చాక చాలా పోగొట్టుకున్నానని చెబుతోంది అందాల తార 'శ్రియ'. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావలసిన మనశ్శాంతిని కోల్పోయానని బాధపడుతుంది. శ్రియ మాట్లాడుతూ హీరోయిన్ గా అత్యున్నత స్థాయికి ఎదిగాను, స్టార్ డమ్ ని ఎంజాయ్ చేశాను. నెలలో 15 రోజులు కేవలం ఫ్లైట్స్ లోనే గడిపేసేదాన్ని.. అంత బిజీ లైఫ్ నాది.

కానీ ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గేసరికి ఎవరికి తోచింది వాళ్లు రాసేస్తున్నారు. ఎవరికి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు. అందుకే చాలా బాధ అనిపిస్తోందని చెప్పింది. బిజీగా ఉన్నప్పుడే నాకున్న ఇమేజ్‌ని క్యాష్ చేసుకోలేని అసమర్థత నాది అని ఇప్పుడు వాపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం మరి.

నాగార్జునను చూసి నవ్విపోతున్న రియల్ బ్రోకర్స్

అక్కినేని వారసుడిగా తెరంగ్రేటం చేసి తెలుగు తెరపై సక్సెస్ అయిన నాగార్జున... రొమాంటిక్ గా హీరో టాలీవుడ్లో తనదైన ముద్ర చేశారు. ఇటు అగ్ర హీరోగా రాణిస్తూనే.... వేరే మార్గాల్లో కూడా బాగానే సంపాదిస్తున్నాడు. తన బిజినెస్ మైండ్ కి పదును పెట్టి హైదరాబాద్ లో ఆస్తులు కొనడంతో పాటు పలు రియల్ ఎస్టేట్ వెంచర్ లో పెట్టుబడులు పెట్టారు.

అయితే ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వూలో నాగార్జున మాట్లాడుతూ... హైదరాబాద్‌లో తనకు పెద్దగా ఆస్తులు లేవు అంటూ పేర్కొన్నాడు. నాగార్జున ప్రకటనను విన్న బడా రిలయ్ ఎస్టేట్ బ్రోకర్లు నవ్విపోతున్నారు. అసలు విషయాల్ని దాస్తూ నాగార్జున జనాలను బురిడీ కొట్టిస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు. ఓ టాప్ రియల్టర్ మాట్లాడుతూ.... హైదరాబాద్ లోని ఖరీదైన ప్రదేశాలన్నింటిలో నాగార్జునకు ఆస్తులున్నాయని చెప్పారు. హైటెక్ సిటీ సమీపంలోని ఎన్-కన్వెషన్ సెంటర్, జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 36లో ఎన్-గ్రిల్ భవనం, రోడ్ నెం. 3లోని టచ్ పబ్ బిల్డింగ్ తదితరాలు అన్ని నాగార్జునకు చెందినవే అంటున్నారు. పైకి అవి నాగార్జున పేరు మీద లేకున్నా అందులో వాటాలు ఉన్నాయంటున్నారు. అభిమానులు, ప్రజల దృష్టి మళ్లించడానికే నాగార్జున ఇలాంటి ప్రకటనలు చే్స్తున్నారంటూ...నాగ్ స్టేట్ మెంట్సును పెద్ద జోక్ గా అభివర్ణిస్తున్నారు.

పవన్ కు ఉన్న క్రేజ్...అమ్మ, నాన్న ఓ పవన్ కళ్యాణ్...!?

‘అమ్మ, నాన్న ఓ పవన్ కళ్యాణ్!' ఇది ఓ ఆటో డ్రైవర్ తన ఆటో వెనుక రాయించుకున్న స్లోగన్. అమ్మ, నాన్నల తర్వాత తనకి పవన్ కళ్యాణే అని ఆ ఆటోడ్రైవర్ తన అభిమానాన్ని పవర్ స్టార్ పై ఇలా చూపించుకున్నాడు. ఇలాంటి వీరాభిమానులు పవన్ కళ్యాణ్ కి చాలా మందే ఉన్నారు.

గత పదేళ్లలో కేవలం ఒకే ఒక్క హిట్టిచ్చినా కూడా పవన్ అభిమానుల సంఖ్య తరిగిపోలేదు. వరుస పరాజయాల్లోనూ అభిమానులు అతని వెన్నంటే నిలిచారు. ఇంతగా తనని అభిమానిస్తున్న అభిమానుల ఆశలు తీర్చాల్సిన సమయం వచ్చిందిప్పుడు. సినిమాలు చేసి పరాజయాలు కొని తెచ్చుకున్న పవన్ రాబోయే(కాళీ, గబ్బర్ సింగ్) రెండు సినిమాలతో మళ్లీ పదేళ్ల నాటి పవర్ చూపించగటడేమో చూడాలి.

ప్రిన్స్ బ్రదర్ సెంటిమెంట్- దూకుడు నిర్మాతలకు చిక్కులు

మహేష్ బాబు హీరోగా వెండి తెరపై వెలుగుతుంటే...అతని సోదరి మంజుల, సోదరుడు మహేష్ బాబు నిర్మాతలుగా సినీ రంగంలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ల బ్యాడ్ లక్ ఏమిటోగానీ...మహేష్ బాబు వేరే బ్యానర్లలలో చేసి హిట్లమీద హిట్లు కొడుతుంటే.....మంజుల నిర్మాణంలో నటించి నాని, రమేష్ బాబు నిర్మాణంలో వచ్చిన అర్జున్, అతిథి సినిమాలు పరమ ప్లాపులుగా మగిలాయి.

దీంతో తమ వాళ్ల నష్టాలను పూడ్చే పనిని నెత్తినేసుకున్నాడు మన హీరో. ఆ మధ్య పూరి జగన్నాథ్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో మంజులతో కొంత పెట్టుండి పెట్టించి పాట్నర్ షిప్ ఇప్పించాడు. అందుకు పూరి కూడా సానుకూలంగా స్పందించాడు. సినిమా పెద్ద హిట్ట అవడంతో మంజులకు పోకిరి వాటాల ద్వారా లాభాలు దక్కాయి.

ఇప్పడు అదే తరహాలో దూకుడు సినిమాకు గాను తన సోదరుడు రమేష్ బాబుకు వాటా ఇప్పించే పనిలో పడ్డాడట మహేష్. అయితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సినిమాలు తీస్తూ ఇప్పుడిప్పడే ఇండస్ట్రీలో తమ మార్కును చాటు కోనే ప్రయత్నం చేస్తున్న దూకుడు నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకరలు తమ సినిమాలో రమేష్ బాబు ఇన్ వాల్వ్ కావడంపై అసంతృగా ఉన్నారట.

లేడీస్ ఫాలోయింగ్ మంచి కిక్కిస్తుంది: నాగ్...!

అక్కినేని నాగార్జున చూస్తే వయస్సు మీదపడుతున్నా రోజురోజుకీ కుర్ర హీరోలా వుంటూ అందరి హృదయాల్లో మన్మధుడుగా సెటిలయ్యాడు..నాగ్ కి లేడీస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువనే చెప్పాలి. సినిమా హీరోగా నాగ్ కి 25ఏళ్లు నిండాయి. తను తీసే ప్రతీ చిత్రానికి సంబంధించిన కథను ప్రారంభానికి ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో పకడ్భందీగా ప్లాన్ చేసుకుంటానంటున్నడు నాగార్జున. అంతే కాకుండా తన లాగే తన కొడుకును కూడా హీరోగా నిలబెట్టాలని తపన పడుతున్నాడు..

నేనింతటి వాడిని కావడానికి ముఖ్యంగా నాన్నగారే కారణం. నాన్నగారి క్షమశిక్షణలో పెరగడం వలన, ఆయన పెంచిన విధానం వలన హీరోగా కొనసాగుతున్నాను. అసలు నా తొలిసినిమా ‘విక్రమ్’ని చూసినప్పుడు ఇంత గ్లామర్ హీరో అవుతానని, నాక్యూడా లేడీస్ ఫ్యాన్స్ వుంటారని నేను ఊహించనే లేదు. నాన్నగారికి లేడీస్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా వున్నారు. అలానే ఇప్పుడు నా విషయంలోనూ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే. లేడీస్ ఫాలోయింగ్ మంచి కిక్కిస్తుంది అంటున్నారు మన్మథుడు...

రోబోకు దీటుగా..‘గజిని’ ని మరిపించే సూర్య...!?

‘గజిని’ చిత్రంతో తమిళ, తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన దర్శకుడు ఎఆర్ మురుగదాస్, సూర్యల కాంబినేషన్‌ లో తమిళంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘7ఆమ్ ఆరివు’. సూర్య కెరీర్‌ లోనే దాదాపు 85 కోట్ల భారీ బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన ‘రోబో’ చిత్రానికి ధీటుగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడని చ్నై సినీ వర్గాల కథనం. అంతే కాకుండా ‘ఎందిరన్’ ఆడియో విడుదల కార్యక్షికమాన్ని నిర్వహించిన మలేషియాలో భారీ ఎత్తున సెప్టెంబర్ 22న ‘7ఆమ్ ఆరివు’ ఆడియో విడుదల కార్యక్షికమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 26న విడుదల కాబోతోంది.

ఈ చిత్రంలో సూర్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ‘సూపర్ మిషన్’ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా వియత్నాంకు చెందిన జాని ట్రింజియన్ విలన్‌ గా పరిచయమవుతున్నాడు. కాగా ‘గజిని’ చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ పేషెంట్‌ గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్‌ గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని కోలీవుడ్ సమాచారం.

అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూ కు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. గ్రాఫిక్స్‌ కు అత్యంత ప్రాధాన్యమున్న ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌ ని జెమ్స్ కె మెరున్ అద్భుతసృష్టి ‘అవతార్’, అలాగే శంకర్ దర్శకత్వం వహించిన రోబో’ చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్‌ ని అందించిన స్టార్ విన్స్‌ స్టన్ స్టూడియో అందిస్తోందట. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో ‘ సెవెంత్ సెన్స్’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారని, ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి. సుబ్రహ్మణ్యం తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాడని తెలుస్తోంది.

నాగబాబు కొడుకుతో కాజల్ రొమాన్స్!

ప్రొడ్యూసర్ నాగబాబు తన తనయుడు వరుణ్ తేజను త్వరలో హీరోగా పరిచయం చేసే యోచనలో ఉన్నట్లు తెలిసిందే. ఇందు కోసం నాగబాబు ఇప్పటికే కథల కోసం అన్వేషణ మొదలు పెట్టారు కూడా. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వరుణ్ తేజ తొలి సినిమాలో కొత్త హీరోయిన్ కాకుండా...మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని యోచిస్తున్నాడట నాగబాబు. ఈ మేరకు నాగబాబు కన్ను కాజల్ పై పడింది.

చందమామ సినిమా నుంచే...కాజల్ నాగబాబు కుటుంబానికి దగ్గరయింది. పైగా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా చెలామని అవుతుంది. వరుణ్ తేజ-కాజల్ కాంబినేషన్‌లో సినిమా అయితే అభిమానుల్లో మంచి అంచనాలుంటాయి, తన కొడుకు కోసం కాక పోయినా కాజల్ కోసం అయినా జనాలు థియేటర్లకు వస్తారు, తద్వారా వరుణ్ తేజ కెరీర్ కు ప్లస్సవుతుందనేది నాగబాబు ఆలోచనగా కనిపిస్తూంది.

మరో వైపు ఈ సినిమాను స్టార్ డైరెక్టర్లతో చేయించాలని నాగబాబు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులను సంప్రదించినట్లు తెలుస్తూంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2012 ద్వితీయ యార్థంలో సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలన్నాయి.

మహేష్ దూకుడు రీ రికార్డింగ్ అత్యద్భుతం...!

మహేష్ బాబు, సమంతా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల డైరెక్షన్లో రూపొందుతున్న 'దూకుడు' సినిమా షూటింగు చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాదులోని వివిధ లోకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. నేటి నుంచి బేగం పేటలోని చిరాన్ ఫోర్ట్ ప్యాలస్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది ఫ్యామిలీ సాంగ్ కావడంతో హీరోయిన్లతో బాటు చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రధారులు కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దినేష్ మాస్టర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ చిత్రీకరణ మరో నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే.

దూకుడు చిత్రం ఆడియో ఇప్పటికే విశేష స్పందన పొందింది. ఇప్పుడు పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం చిత్రం రి రికార్డింగ్ చాల అద్భుతం గా వచ్చిందని సమాచారం. ఫస్ట్ హాఫ్ రి రికార్డింగ్ పూర్తవ్వగానే మహేష్ బాబు సైతం సంగీత దర్శకుడు తమన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. సెప్టెంబర్ 23 న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

అమలతో రచ్చ చేసిన రామ్ చరణ్..!?

‘ఆరెంజ్’ తర్వాత చరణ్ చేస్తోన్న సినిమా ‘రచ్చ’. తమన్నా హీరోయిన్...దర్శకుడు సంపత్ నంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అమలా పాల్ (నాన్నఫేం)పేరును హీరో చరణ్ ప్రతిపాదించాడట. ఈ విషయమై ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి కన్ ఫర్మేషన్ లేకపోయినప్పటికీ, ‘రచ్చ’ సినిమాలో అమలాపాల్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వనుందంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘నాన్న’ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకున్న అమలాపాపల్, నాగచైతన్యతో ఓ సినిమా చేయనుంది. దానికన్నా ముందే విడుదల కానున్న ‘రచ్చ’లో అతిథి పాత్రకు దాదాపు ఖాయమపోయింది. ఇక సిద్ధార్థతో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే..టాలీవుడ్ లో పలువురు యువ హీరోల మనసు దోచేసిందట. ఆమె గ్లామర్ అలాంటిది మరి..అంటూ అమలాపాల్ టాలీవుడ్ లో దూసుకుపోనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ లో చాలామంది.

Sidra Khan Hot Pics



Harika Sexy Stills



Scintillating Vidya in The Dirty Picture



Naga Chaitanya Photo Shoot



Vikram in a new getup



Hot N Spicy Shradha Das Gallery