Tuesday 30 August 2011

మహేష్ దూకుడు రీ రికార్డింగ్ అత్యద్భుతం...!

మహేష్ బాబు, సమంతా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల డైరెక్షన్లో రూపొందుతున్న 'దూకుడు' సినిమా షూటింగు చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాదులోని వివిధ లోకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. నేటి నుంచి బేగం పేటలోని చిరాన్ ఫోర్ట్ ప్యాలస్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది ఫ్యామిలీ సాంగ్ కావడంతో హీరోయిన్లతో బాటు చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రధారులు కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దినేష్ మాస్టర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ చిత్రీకరణ మరో నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే.

దూకుడు చిత్రం ఆడియో ఇప్పటికే విశేష స్పందన పొందింది. ఇప్పుడు పరిశ్రమ వర్గాల కథనం ప్రకారం చిత్రం రి రికార్డింగ్ చాల అద్భుతం గా వచ్చిందని సమాచారం. ఫస్ట్ హాఫ్ రి రికార్డింగ్ పూర్తవ్వగానే మహేష్ బాబు సైతం సంగీత దర్శకుడు తమన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. సెప్టెంబర్ 23 న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

No comments:

Post a Comment