Tuesday 30 August 2011

చిరు తీరు...లబోదిబో మంటున్న కార్ల కంపెనీ

పాతికేళ్ల పాటు వెండితెరను ఏలిన చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకే మెగాస్టార్‌గా మారారు. ఈ క్రమంలో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. చిరంజీవి ఏ పని చేసినా, ఎలాంటి స్టేట్ మెంట్ ఇచ్చినా అది త్వరగా ప్రజల్లోకి వెలుతుంది. ఈ నేపథ్యంలో గతంలో చిరంజీవి చర్యల వల్ల ఫ్యాన్స్ సంతోష పడ్డ సందర్భాలు, అప్ సెట్ అయిన సందర్భాలు ఉన్నాయి కూడా...

తాజాగా...ఓ కార్ల కంపెనీ చిరంజీవి తీరుతో లబోదిబో మంటోంది. మగధీర సినిమా ద్వారా సెన్సేషన్ హిట్ కొట్టిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన రెమ్యూనరేషన్ వెచ్చించి తండ్రికి ప్రపంచ ప్రసిద్ధ ఖరీదైన ‘రోల్స్ రాయిస్’ కారును కొని పెట్టాడు. అయితే కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఆ కారును వాడటం లేదు. దీంతో ఆ కారు చిరు ఇంట్లో ఓ మూలకు ఫెడ్డుకే పరిమితం అయింది. రాజకీయాల్లోకి వచ్చాడు సింపుల్ గా జీవించాలని ఆ నిర్ణ యం తీసుకున్నాడనుకున్నాం...అందుకే ఆ ఖరీదైన కారు వాడటం లేదని అనుకుంటే పొరపాటే. చిరంజీవి ప్రస్తుతం రూ. 2.5 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ కారును వాడుతున్నారు.

దీంతో రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ లబోదిబోమంటోంది. మోగాస్టార్ ఇంటికి మా కారు వెళ్లిందని తొలుత సంతోష పడ్డాం....కానీ ఆయన తీరుతో ఇప్పడు బాధ పడుతున్నాం అని రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన సీనియర్ సేల్స్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు. తమ కంపెనీ కారును అప్పుడప్పుడైనా రోడ్ల మీదకు తెస్తే బాగుంటుందని అంటున్నారు.

No comments:

Post a Comment