Tuesday 30 August 2011

'ఊసరవిల్లి' ఆడియో వాయిదా


ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్ లో సురేంద్ర రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'ఊసరవిల్లి'. ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 12వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. మొదట ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 11న అనుకున్నారు కానీ ఆ రోజు వినాయిక నిమజ్జనం రావటంతో దాన్ని మార్చుకున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రయాణంలో మంచు మనోజ్ ప్రక్కన చేసిన పాయిల్ ఘోర్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.ఈ చిత్రాన్ని నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పగను హీరో తన శక్తులన్నీ ఒడ్డి తీరుస్తాడని, గజనీలాంటి గమ్మత్తైన పాయింట్ తో ఈ చిత్రం స్క్రిప్టు రెడీ అయిందైని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. యాక్షన్ కలగలిసిన లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనతో ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నాడంటున్నారు. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. అలాగే సురేంద్రరెడ్డి కిక్ విజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.

No comments:

Post a Comment