Tuesday 30 August 2011

ముంబైలో రూ. 20 కోట్లతో ప్లాట్ కొంటున్న రాణా

ముంబై మహానగరం. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థానంతో పాటు, బాలీవుడ్ చిత్ర సీమకు కేంద్ర బింధువు. దీంతో పాటు కళ్లు తిరిగే పాష్ లొకేషన్లు, సముద్రతీరం ముంబై సొంతం. అందుకే బాలీవుడ్ లో స్టార్ అయిపోవాలనుకునే వారు, పెద్ద పెద్ద వ్యాపారస్తుల చూపులు ఎప్పుడూ ముంబైపై ఉంటాయి. అక్కడ నివాసం ఏర్పరుచుకుని అక్కడే సెటిల్ అయితే ఏదో ఒక రకంగా రాణించ వచ్చనేది వారి ఆలోచన.

తాజాగా....డి. రామానాయుడు మనవడు రాణా చూపులు కూడా ముంబైపై పడ్డాయి. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాణా అక్కడ సెటిల్ అయ్యేందుకు కరసరత్తు ప్రారంభించాడు. రాణా సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం రాణా ఇప్పడు ముంబైలో ఆస్తులు కొనే పనిలో పడ్డాడు. ఇందు కోసం రూ. 20 కోట్లు రెడీ చేసుకున్న ఈ హీరో అక్కడ ప్లాట్ కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనె ప్రభదేవీ ఏరియాలో ఇటీవల కొనుక్కున్న కొత్త ఫ్లాట్ సమీపంలోనే రాణా కూడా ప్లాట్ కొనాలని చూస్తున్నాడట.

అయితే...ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారం విషయంలో మంచి అవగాహన ఉన్న రాణా తండ్రి సురేష్ మాత్రం రాణా ప్రయత్నాలపై అసంతృగా ఉన్నట్లు తెలుస్తూంది. రాణా కొనాలని యోచిస్తున్న ఏరియాలో కాకుండా సౌత్ ముంబైలో పెట్టుబడి పెడితే బాగుంటుందని సూచించాడట.

No comments:

Post a Comment